తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీలు మంత్రి కేటీ రామారావును తెలంగాణ భవన్లో కలిశారు. నీట్ పరీక్ష రద్దు అంశంపై మంత్రి కేటీఆర్ను కలిశామని డీఎంకే ఎంపీ ఎలోన్గోవన్ తెలిపారు. కేంద్ర విధానంపై తామునిరసన చేస్తున్నామని…తమకు మద్దతు తెలపాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆడిగామని చెప్పారు. కేంద్రం కీలకమైన విషయాలలో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదన్నారు.టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, నీట్ రద్దుకు డిమాండు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎం కేసీఆర్కు రాసిన లేఖను ఈ సందర్భంగా వారు కేటీఆర్కు అందజేశారని తెలిపారు. నీట్ రద్దుకు మద్దతు తెలపాలని కోరుతూ, స్టాలిన్ ఇటీవల 12 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.