Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు షాక్‌

విశాలాంధ్ర`జవహర్‌ నగర్‌ : మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లా రెడ్డి కాలేజీల్లో ఐటి శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున నుండి హైదరాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ఏకకాలంలో 50 చోట్ల ఐటీ శాఖ తనికీలు చేపట్టారు.మంత్రి మల్లారెడ్డి కూతురు కొడుకులు అల్లుళ్ల నివాసాలతో పాటు మంత్రి మల్లా రెడ్డి తమ్ముళ్ల నివాసాలపై 50 బృందాల సహాయం తో సోదాలు జరుపుతున్నారు.మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌ రెడ్డి ఇంట్లో కొంపల్లి లోని ఆయన ఉంటున్న నివాసంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తున్నారు.ఇప్పటికే మల్లారెడ్డి విద్యాసంస్థల్లో జరుగుతున్న అవకతవకలపై ఐటి అధికారులు మల్లారెడ్డి కుమారులు అల్లుడు కూతురు పై పలు ప్రశ్నల వర్షం కురిపించి పలు కీలక ఆధారాలతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని ఆదాయానికి మించిన ఆస్తులపై పలు విద్యాసంస్థల పన్ను ఎగవేత పై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img