Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు.. కేసు నమోదు

ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికారులు తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి బుధవారం ఆరోపించగా.. గురువారం తమపైనే మల్లారెడ్డి దాడి చేశారని ఐటీ అధికారులు ప్రతి ఆరోపణలు చేశారు. ఈమేరకు వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మంత్రి తమపై దాడి చేసి ల్యాప్‌ టాప్‌, మొబైల్‌ ఫోన్లు గుంజుకున్నారని ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోదాల సందర్భంగా తాము సేకరించిన సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపించారు. ల్యాప్‌ టాప్‌ తెచ్చి ఇచ్చినా ఐటీ సిబ్బంది దానిని తీసుకోలేదు. అది తమ ల్యాప్‌ టాప్‌ కాదని చెప్పడంతో దానిని పోలీస్‌ స్టేషన్‌ లో భద్రపరిచినట్లు సమాచారం. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img