పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే అంశంపై ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన కమిటీ..ఇవాళ మూడోసారి సమావేశమైంది.ఇటీవల రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన దీనిపై క్యాబినెట్ సబ్కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్యాబినెట్ సబ్కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, అటవీ శాఖ పీసీసీఎఫ్ శ్రీమతి శోభ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.