Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యం : మంత్రి ఎర్రబెల్లి

హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ ప్రధాన లక్ష్యమని, బీజేపీ మత విద్వేషాలకు బలి కావొద్దని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లాని తొర్రూరు పట్టణంలో మంత్రి రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం దుబ్బ తండాలో దుర్గమ్మ గుడికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేశంలో బీజేపీ అధికార దాహంతో ప్రజలను మతాల పేరుతో విడదీసి చిచ్చుపెట్టి పరిపాలన సాగిస్తోందన్నారు. దేశంలో దశాబ్దాలుగా కలిసిన ఉన్న విధంగానే హిందూ, ముస్లింలము అన్నదమ్ముల్లా కలిసి ఉందామని మంత్రి అన్నారు. మసీదు అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలతో పలు కార్యక్రమాలను చేపడతామని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img