రాష్ట్రంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు..పలుచోట్ల వరద పరిస్థితులు ఉండటంతో మరో 3 రోజుల పాటు సెలవులు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సోమవారం నుంచి నేటి వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో.. మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించారు. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఎంసెట్ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.