సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఇంజినీర్లు, ప్రజాప్రతినిథులతో కలిసి మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రైతుల తలరాత మార్చే, తరతరాలు నిలిచే ప్రాజెక్టు మల్లన్న సాగర్ అన్నారు. మల్లన్నసాగర్లోకి ప్రస్తుతం 11 టీఎంసీ నీరు వచ్చిందని, అవి 30 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని, బండ్ మొత్తం 22 కిలోమీటర్లు ఉండగా.. దాదాపు 20 కిలోమీటర్ల మేర నీళ్లు చేరాయన్నారు. ఇది ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప పని అని, అనతి కాలంలోనే దీనిని పూర్తి చేసుకున్నామని అన్నారు.