Friday, April 19, 2024
Friday, April 19, 2024

మసిపూసి మారేడు కాయ చేసిన గోల్‌ మాల్‌ బడ్జెట్‌ : సీఎం కేసీఆర్‌

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పందించారు. ఈ బడ్జెట్‌ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసిందని పేర్కొన్నారు. ఇదో గోల్‌ మాల్‌ బడ్జెట్‌ అన్నారు. ఈ బడ్జెట్‌ అన్ని వర్గాలను నిరాశ పరిచిందన్నారు. ఇది పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్‌ అని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగం ఆసాంతం డొల్లతనం తో నిండి, మాటలగారడీ తో కూడి వున్నదని అని సిఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ, మసిపూసి మారేడు కాయ చేసిన గోల్‌ మాల్‌ బడ్జెట్‌ గా పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని అన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌ ను బిగ్‌ జీరో అని అన్నారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్‌ సున్నా చుట్టిందన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్‌ కం టాక్స్‌ లో స్లాబ్స్‌ ను ఏమీ మార్చకపోవడం విచారకరమని అన్నారు. ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని, వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్‌ నీళ్లు చల్లిందన్నారు.కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img