మహబూబాబాద్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. కాగా ఆమె వెంట ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్మన్ బిందు, ఎస్పీ శరత్ చంద్ర పవర్ , మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నుకల నరేష్ రెడ్డి తదితరులు పట్టణంలో నూతన మెడికల్ కళాశాల, జిల్లా కలెక్టర్ నూతన కార్యాలయం, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.