Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలి : రేణుకా చౌదరి

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారిపై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతకాదని మండిపడ్డారు. అధికారం, సభలో మంద బలం ఎప్పుడూ శాశ్వతం కాదని…. కేవలం మన హుందాతనం, ప్రవర్తన మాత్రమే శాశ్వతమని అన్నారు. ప్రజా ప్రతినిధులు బాధ్యత మరచి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరైంది కాదని, అధికార, ప్రతిపక్షాలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సభ్యులు పనిచేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img