Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

నగరంలోని మాదాపూర్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టైంది. ఈ కేసుకు సంబంధించి మహమ్మద్‌ అష్రాఫ్‌ బేగ్‌, రామేశ్వర శ్రవణ్‌ కుమార్‌, చరణ్‌ తేజ ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఇందులో ప్రధాన నిందితుడు జూడ్‌ పరారీలో ఉన్నాడని తెలిపారునైజీరియాకు చెందిన జూడ్‌ అనే వ్యక్తి ద్వారా ముఠా సభ్యులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని, న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా గోవా నుంచి భారీగా డ్రగ్స్‌ను తెప్పించి ముఠా సభ్యులు హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా సైబరాబాద్‌ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2021లో సైబరాబాద్‌ పరిధిలో 202 కేసులు నమోదు కాగా.. 419 మందిని అరెస్ట్‌ చేశాం. రిపీటెడ్‌గా డ్రగ్స్‌తో పట్టుబడుతున్న 23 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశాం. 183 గ్రాముల కొకైన్‌, 44 ఎండీ ఎస్టేసి ట్యాబ్లెట్‌ను స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు. మొత్తం 26 లక్షల 28 వేల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img