ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతివ్వనున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేత కేశవరావు శుక్రవారం చెప్పారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు శుక్రవారం పార్లమెంటు వెలుపల మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతివ్వాలని ఆ పార్టీ చీఫ్ కే చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఆ పార్టీ ఎంపీలందరికీ ఈ మేరకు సూచించారు. ఇదిలావుండగా, మార్గరెట్ అల్వా టీఆర్ఎస్ ఎంపీలను శుక్రవారం సాయంత్రం కలుస్తారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు శనివారం జరుగుతాయి.