Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మార్చి తర్వాత దళిత బంధు అమలు : సీఎం కేసీఆర్‌

జనగామ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దళిత బంధు కింద ఈ సంవత్సరం 40 వేల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేయనున్నామని తెలిపారు. జనగామ ఒకప్పుడు కరువు సీమగా ఉండేదని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరెంట్‌, మంచి నీటి ఇబ్బందు లేవని, బచ్చన్నపేటలో బతుకులు బాగుపడ్డాయని చెప్పారు. దేవాదుల ప్రాజెక్ట్‌తో సాగునీరు అందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఘనపురం, పాలకుర్తిలో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. జనగామకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img