Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మార్చి 1 నుండి ట్రాఫిక్‌ చలాన్స్‌పై రాయితీ..

మార్చి 1 నుండి ట్రాఫిక్‌ చలాన్స్‌ చెల్లింపులపై రాయితీ ఇస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఒక నెల వరకు ఈ రాయితీ చెల్లింపు ఉంటుందని తెలిపారు. కోవిడ్‌ నేపథ్యంలో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో లోకదాలత్‌ ద్వారా ఈ రాయితీ కేటాయించామన్నారు. కోవిడ్‌ మాస్క్‌ కేసుల్లో 1000 రూపాయలకు గాను 100రూపాయలు రాయితీ ఇస్తున్నామన్నారు. పేదవర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని వెసులుబాటు కల్పించాం అన్నారు. ప్రతి చాలనాను మీ సేవా,ఆన్లైన్‌ ద్వారా ,తెలంగాణ ఈ చాలాన్‌ ద్వారా పే చేయవచ్చన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రాఫిక్‌ చాలాన్‌ కట్టుకునే అవకాశం ఉందన్నారు. నెలరోజుల్లో కట్టలేని వారికి మరో వెసులుబాటు కల్పించడాకిని కృషి చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img