కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం వారం రోజులపాటు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహిస్తున్నది. ఏడురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను కాకతీయుల 22వ తరం వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భంజ్దేవ్ ఇవాళ ఉదయం వరంగల్కు చేరుకుని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. బస్తర్లో తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కాకతీయ ఉత్సవాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్దేవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.