Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ముందస్తు చర్యలతో నష్టం జరగలేదు


: మంత్రి ఎర్రబెల్లి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకోవడంతో భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.నర్సంపేట పట్టణ సమీపంలో నున్న మాదన్నపేట చెరువును మంత్రి సందర్శించారు. వరద పరిస్థితిని పరిశీలించారు. వర్షం వల్ల నష్టం జరుగకుండా అధికారులతో ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తూ తగు సూచనలు చేశామన్నారు. మంత్రి వెంట వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరిత, తదితర అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img