Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టు : షర్మిల

దిల్లీి కోటలు బద్దలు కొట్టుడు కాదు.. ముందు రాష్ట్రంలో ఆగమైతున్న రైతులను నిలబెట్టాలని సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల విరుచుకుపడ్డారు. రోజుకిద్దరుగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలని డిమాండు చేశారు. ‘మోదీని దేశం నుంచి తరుముడు ఏమో గానీ… నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరమకుండా చూస్కో.’ అని అన్నారు. మీరు పులి బిడ్డయితే… మొన్న మీ మెడ మీద లేని కత్తిని చూసి… వడ్లు కొననని ఎట్లా రాసిచ్చారు దొరగారు?’’ అని ప్రశ్నించారు. నిన్నటిదాకా కేంద్రానికి వంతపాడి, ఈరోజు ఉడుత ఊపుల పంచాయితీ పెట్టారని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలనే పరిష్కరించడం చేతకాని మీరు దేశ రాజకీయాలు చేస్తారా? అని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img