Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ముగిసిన గడువు.. రూ. 302 కోట్ల ట్రాఫిక్‌ చలానాల వసూలు

పెండిరగ్‌ చలానాలను రాయితీపై చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన గడువు నిన్నటితో ముగిసింది. చివరి రోజు కూడా చలానాలు పెద్దమొత్తంలో వసూలయ్యాయి. వాస్తవానికి ఈ గడువు ఇదివరకే ముగియగా, ఈ నెల 15 వరకు దానిని పొడిగించారు. దీంతో గతంలో చెల్లించలేకపోయిన వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నిన్న రాత్రి 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 302 కోట్లు వసూలయ్యాయి. మొత్తంగా ఐదు కోట్ల పెండిరగ్‌ చలానాలకు గాను 3 కోట్ల చలానాలు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం రూ.1,015 కోట్ల చలానాలు జారీ చేయగా, రాయితీ పోను రూ. 302 కోట్లు వసూలైనట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img