Friday, April 19, 2024
Friday, April 19, 2024

మునుగోడులో బీజేపీకి మూడో స్థానమే: జగదీష్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని.. మాజీఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించడంపై మంత్రి జగదీష్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. మునుగోడులోనే ఎన్నికలు పెట్టే ధైర్యం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. మునుగోడులో ఉప ఎన్నికలు పెట్టనివారు.. రాష్ట్రంలో ముందస్తు అంటూ మట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత తెల్లారే ఎన్నికలు పెడతామని చెప్పి.. ఇన్ని రోజులైనా ఎందుకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని ప్రశ్నించారు.ఒక్క నియోజకవర్గంలోనే బరిలోకి దిగని వారు.. రాష్ట్రం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జగదీష్‌ రెడ్డి సెటైర్లు వేశారు. ఎన్ని సర్వేలు చేసుకున్నా.. బీజేపీ మునుగోడులో మూడో స్థానంలోనే ఉందని తేలిందన్నారు. ఆ విషయం వాళ్లకు, ప్రజలకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి జగదీష్‌ రెడ్డి స్పష్టం చేశారు. విభజన హామీలను బీజేపీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అడుగడుగునా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img