Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌..ఇప్పటివరకు 28 ఫిర్యాదులు : సీఈవో

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడిరచారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లాడినట్లు సీఈవో తెలిపారు. ఫిర్యాదు వచ్చిన సామాజిక మాధ్యమాల లింకుల ద్వారా విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగినట్లు చెప్పారు. పోలీసులు వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారన్నారు. అదేవిధంగా మునుగోడులో మూడు చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తినట్లు తెలిపారు. మరోచోట 20 ఓట్లు పడ్డాక ఈవీఎం మొరాయించడంతో రీప్లేస్‌ చేసినట్లు చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారనే, పోలింగ్‌ కేంద్రాల వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపించినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img