Friday, April 19, 2024
Friday, April 19, 2024

మునుగోడు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ బదిలీ ఆక్షేపణీయం : మంత్రి కేటీఆర్‌

మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కణమని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌ పైన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img