ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సుదీర్ఘ కాలంపాటు ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ములాయం అని అన్నారు. ఆయన మరణం బడుగు బలహీన వర్గాలు ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.