మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడు రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటించింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్లోని స్టార్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.