అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు జరపాలని పార్టీ నిర్ణయించిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. మూడు రోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలు జరపాలని, ఈ కార్యక్రమాల్లో కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీ కట్టడం, పని చేస్తున్న మహిళలను గౌరవించడం, సన్మానించడం, ఆ ప్రాంతంలో మహిళలకు జరిగే అభివృద్ధి వివరించడం వంటి పనులు చేపడుతామన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తామన్నారు. ఇందులో మహిళలంతా భారీ ఎత్తున పాల్గొనాలని మంత్రి సత్యవతి పిలుపునిచ్చారు.