మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
మూసీలో వరద ఉధృతి పెరిగింది. దీంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీలో వరద ప్రవాహం పెరిగింది. మూసారాం బాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ చేశారు. కిషన్ బాగ్, చాదర్ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట్ ప్రాంతాల్లో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు.