మెట్రోరైలు రాకపోకల సమయాన్ని పెంచారు. ఉదయం 7.10 నుంచి రాత్రి 9.45 గంటల వరకు నడిచిన రైళ్లను ఇక అదనంగా మరో గంటన్నరపాటు పొడిగించారు. దీంతో ఉదయం 7 గంటలకు బయలుదేరిన రైళ్లు రాత్రి 11.15 వరకు నిర్విరామంగా తిరగనున్నాయి.సోమవారం నుంచి పెంచిన వేళలు అమలుకానున్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. చివరి రైలు టర్మినల్ స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 వరకు చివరి స్టేషన్కు చేరుకుంటుందని తెలిపారు.