హైదరాబాద్ మెట్రో మరో ఘనతని సాధించింది. గుండెను యుద్ధ ప్రాతిపదికన మార్చేందుకు వరంలా మారింది మెట్రో రైల్. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి కుటుంబం.. గుండెను దానంగా ఇవ్వటానికి ఒప్పుకోవటంతో జబ్లీహిల్స్ లోని మరో రోగికి పునర్జన్మను ఇచ్చినట్లైంది.నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తికి మెదడుకు తీవ్ర గాయమైంది. దీంతో.. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించగా.. ఆరోగ్యం విషమించి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు అతడి కిడ్నీలు.. గుండె.. కాలేయం.. కార్నియాను దానం ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇదే సమయంలో మూత్రపిండాలు.. గుండె దెబ్బ తిని చికిత్స పొందుతున్న 32 ఏళ్ల వ్యక్తికి శస్త్ర చికిత్స చేసేందుకు వీలుగా జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు జరిగాయి.