Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మేం నామినేటెడ్‌ వ్యక్తులం కాదు: మంత్రి తలసాని

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తాము నామినేటెడ్‌ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ ప్రెస్‌మీట్లు పెట్టి నిందించటం సరికాదన్నారు.గవర్నర్‌ రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వంపైన ఆరోపణలు సరికాదని అన్నారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్‌ అనే పాత్ర చాలా తక్కువ… గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటూ హితవుపలికారు. సీఎంతో పనిచేయడం ఇష్టం లేదని చెప్పడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img