Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మేడ్చల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యాలయంలో సీట్లో కలెక్టర్‌ ఎస్‌ హరీశ్‌ను కూర్చుండబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి. శుభాకాంక్షలు తెలిపారు. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్ల నిధులతో శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కలెక్టర్‌ ఎస్‌ హరీశ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా త్రివర్ణ బెలూన్లను ఎగుర వేశారు. ఆ తర్వాత సీఎం స్థానిక ఐడీవోసీ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img