Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మైనార్టీ బంధు ఇవ్వాలి : : రేవంత్‌రెడ్డి

దళితబంధు లాగా మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.శనివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీ గర్జనలో ఎంపీ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్‌, వక్ఫ్‌ బోర్డు జ్యుడీషరీ పవర్స్‌ కల్పిస్తామని ప్రకటించారు. దళితుల కంటే కూడా ముస్లింలు వెనుకబడ్డారని చెప్పుకొచ్చిన ఆయన.. కాంగ్రెస్‌ మైనార్టీ గర్జన సభ ఓట్ల కోసం పెట్టలేదన్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేవన్న విషయం గుర్తించాలన్నారు.రాష్ట్రపతి, సీఎం పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్‌ మాత్రమే ఇచ్చిందని తెలిపారు. కారునో, పతంగినో నమ్ముకుంటే మోసపోయేది మీరే అంటూ మైనార్టీలను హెచ్చరించారు. మైనార్టీలు ఒకసారి ఆలోచించాలని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్‌ మాత్రమేనని గుర్తుచేశారు.యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.. త్రిబుల్‌ తలాక్‌, ఎన్‌ఆర్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్‌ మాత్రమేనని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img