తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పెంచని చార్జీలు లేవని వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొన్న ఆర్టీసీ చార్జీలు, ఇవాళ కరెంట్ చార్జీలు పెంచారని అన్నారు. 50 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే పేదలను కూడా వదలడం లేదన్నారు. ఏడాదికి రూ.6,800 కోట్ల లోటును పూడ్చేందుకే.. సామాన్యుడిపై విద్యుత్ భారాన్ని మోపారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని షర్మిల అన్నారు.