Friday, April 19, 2024
Friday, April 19, 2024

యాదగిరి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుస్టేషన్‌లో కరోనా కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పోలీసుస్టేషన్‌లో కరోనా కలకలం రేగింది. పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, మరో 10 మంది కానిస్టేబుళ్లు, కరోనా బారినపడ్డారు. దీంతో వీరంతా ప్రస్తుతం హోంఐసోలేషన్‌లో ఉన్నారు. అక్కడే చికిత్స పొందుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో సుమారు 70 మంది పనిచేస్తుండగా వారం రోజుల వ్యవధిలో 12 మందికి వైరస్‌ సోకింది. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img