Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం ఆపేందుకు కుట్ర : మంత్రి జగదీష్‌ రెడ్డి

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం ఆపాలంటూ ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పుపై విద్యుత్‌ శాఖా మంత్రి జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ని ఆపేందుకు కుట్ర జరుగుతోందని, అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే నిర్మాణం మొదలుపెట్టడం జరిగిందన్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఏకపక్షంగా ఉందని, %చీస్త్ర్‌% తీర్పు యావత్‌ దేశానికి నష్టం కలిగేలా ఉందన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదన్నారు. నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి. ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు యాదాద్రి పవర్‌ ప్లాంట్‌కి సంబంధం ఏంటన్నారు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర దాగి ఉందని, పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మాణం చేపట్టామన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం ఆపాలని వచ్చిన తీర్పు పై న్యాయపోరాటం చేస్తామని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img