Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

యాసంగిలో కిలో వడ్లు కూడా కొనేది లేదు : కేసీఆర్‌

యాసంగిలో కొలో వడ్లు కూడా కొనేది లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాటు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పారు. కలెక్టర్ల సమావేశంలో వ్యవసాయంపై చర్య సందర్భంగా సీఎం ఈ విషయాన్ని స్పష్టంచేశారు. యాసంగిలో వరిధాన్యం కొనబోమని కేంద్రం పదేపదే చెప్తోందని, ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని కేసీఆర్‌ ఆదేశించారు. వానాకాలం పంటలసాగుపై ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ లాభసాటి పంటలసాగుపై దృష్టిసారించాలని సూచించారు. పత్తి, వరి, కందిసాగుపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణలోని వ్యవసాయ విధానాలు దేశంలో ఎక్కడా లేవని కేసీఆర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img