తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా నేడు జాతీయ రహదారులపై రాస్తారోకోలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో రైతులు పండిరచిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ధర్నాలకు దిగారు. జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టారు. నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకో చేపట్టారు.