Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాజకీయాల్లోకి వస్తున్నాననే ప్రచారం వల్లే…

నన్ను తొక్కేద్దామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన

థాయ్ లాండ్ లో పోకర్ టోర్నమెంట్ కు తాను ఆహ్వానితుడిగా వెళ్లానని, దానిని తాను ఆర్గనైజ్ చేయలేదని చికోటి ప్రవీణ్ మరోసారి స్పష్టం చేశాడు. ఈ మేరకు తన అరెస్ట్, తనపై జరుగుతున్న ప్రచారంపై వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు. పోలీసులు దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి తాను రూ.50 లక్షలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ కఠిన చట్టాలు ఉంటాయని తెలిపాడు. ఈ పోకర్ ఈవెంట్ ను తాను ఆర్గనైజ్ చేయలేదని, దేవ్, సీతలు ఆర్గనైజ్ చేశారని, ఈ విషయాన్ని ఇంతకుముందే చెప్పానని తెలిపాడు. ఈ ఈవెంట్ కు అనుమతి ఉందని ఆర్గనైజర్స్ లేదని పోలీసులు చెప్పారని చెపపాడు. ఈవెంట్ ను తాను ఆర్గనైజ్ చేసి ఉంటే ఇంత ఈజీగా బయటకు రానని చెప్పాడు. తన పాస్ పోర్టు బ్లాక్ లిస్ట్ లో కూడా లేదన్నాడు. థాయ్ లాండ్ లో కఠిన శిక్షలు ఉంటాయని చెప్పాడు. తాను తప్పు చేసి ఉంటే అక్కడి పోలీసులు అంత సులభంగా వదలరని చెప్పాడు. తాను గ్యాంబ్లింగ్ చేస్తే ఏడేళ్ల వరకు కఠిన శిక్షలు ఉంటాయన్నాడు. తనను అరెస్ట్ చేసిన రోజు కోర్టుకు సెలవు అని, అలాగే తనకు, తనతో పాటు అరెస్టైన వారికి పెనాల్టీ విధించారని చెప్పాడు.

థాయ్ లాండ్ లో తన అరెస్టుపై కుట్రలు చేస్తున్నారని, తనను తొక్కేద్దామని చూస్తున్నారన్నాడు. రాజకీయాల్లోకి వస్తున్నాననే వదంతులతో తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పాడు. ఈ ఈవెంట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. రెండ్రోజులుగా తనపై మరో ప్రచారం సాగుతోందని, థాయ్ లాండ్ లో ఈ కేసు నుండి తప్పించుకోవడానికి తాను రూ.50 లక్షలు ఇచ్చారని అంటున్నారని, కానీ ఉన్నతాధికారి రైడ్ చేశారని, అలాగే అక్కడ డబ్బులు ఇచ్చి తప్పించుకునే పరిస్థితి లేదన్నాడు. చట్టం చాలా కఠినంగా ఉంటుందని చెప్పాడు. అక్కడి ఈవెంట్ కు చికోటికి (తనకు) ఎలాంటి సంబంధం లేదని అందరు తెలుసుకోవాలన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img