Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్‌ భేటీ..

పార్టీ మారొద్దంటూ బుజ్జగింపులు..!
మునుగోడు ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పడం దాదాపు ఖరారైంది. ఇటీవల బీజేపీ నేతలతో ముచ్చటించిన రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినా వెళ్లకపోవడం అందుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి వీడ్కోలు చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని చెప్పకనే చెప్పింది. టీఆర్‌ఎస్‌ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించే దిశగా తాను వేసే అడుగుల్లో రాజీ పడబోనంటూ ఆయన తేల్చి చెప్పడంతో మునుగోడు ఉప ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయాలు వేడెక్కడంతో కాంగ్రెస్‌ పార్టీ రాజగోపాల్‌ రెడ్డికి బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది. కోమటరెడ్డి పార్టీ వీడకుండా చూడాలంటూ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి జూబ్లిహిల్స్‌లోని రాజగోపాల్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీని వీడొద్దంటూ ఉత్తమ్‌.. కోమటరెడ్డిని బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో.. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో హైదరాబాద్‌లోని తన ఇంట్లో వరుస సమావేశాలు నిర్వహించిన కోమటరెడ్డి.. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశాలపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img