రాజీవ్ ఖేల్రత్నను ధ్యాన్చంద్ ఖేల్రత్నగా మార్చడం సరికాదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.ఇది దారుణం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, మోదీ పాలకుల సంకుచిత బుద్ధికి ఇది నిదర్శనమని విమర్శించారు. చిల్లర రాజకీయాలు మానుకొని రాజీవ్ ఖేల్రత్న అవార్డు కొనసాగించాలని డిమాండ్ చేశారు.