ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందంటూ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నిందితుడు రాజు మృతదేహం స్టేషన్ ఘన్పూర్ రైల్వేట్రాక్పై ఉన్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తనకు సమాచారం ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ డీజీపీ కూడా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఇదే విషయంపై ప్రకటన చేశారు.చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ ధ్రువీకరించారు.