2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం రాబోతుందని, దేశ రైతులందరికి ఉచిత నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘2024 తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాన్ బీజేపీ జెండానే ఎగురతది. దిక్కూమలిన, రైతుల వ్యతిరేక బీజేపీని సాగనంపుదాం. దిల్లీ గడ్డ మీద మన ప్రభుత్వమే రాబోతోంది.2024లో ముక్తు భారత్ నినాదంతో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. భారతదేశ యావత్ రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తున్నాను.’ అని అన్నారు.