Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రామగుండం అగ్నిగుండం అవుతుంది..

ప్రధాని మోదీ తెలంగాణ టూర్‌పై తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. వివిధ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఈ నెల 12న రాష్ట్ర పర్యటనకు మోదీ రానున్నారు. మోదీ పర్యటనను అడ్డుకుంటామంటూ వామపక్ష నేతలు, విద్యార్థి జేఏసీ ప్రకటనలు చేయడం హీట్‌ పుట్టిస్తోంది. ప్రధాని మోదీ వస్తే రామగుండం అగ్నిగుండం అవుతుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. తక్షణమే యూనివర్సిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేసింది.యూనివర్సిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లును ఆమోదించకపోవడం వల్ల యూనివర్సిటీల్లో పెండిరగ్‌ పోస్టుల నియామకం ఆగిపోయిందని, బిల్లు ఆమోదించాల్సిందిగా వెంటనే గవర్నర్‌ను రీకాల్‌ చేయాలని విద్యార్థి జేఏసీ సూచించింది. అటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రధానికి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందని, దురుద్దేశంతోనే ప్రధాని తెలంగాణ పర్యటనకు వస్తున్నారని అన్నారు. గత ఏడాది ప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఇప్పుడు మోదీ వచ్చి ప్రారంభించడం ఏంటి? అని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ఎల్లుండి నుంచి మోదీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 8 సంవత్సరాల్లో తెలంగాణకు మోదీ ఏం చేశారో చెప్పాలని, విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. గవర్నర్‌ తమిళి సై తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని, మీరు గవర్నరా? లేదా బీజేపీ కార్యకర్తనా? అనేది ముందు తేల్చాలని డిమాండ్‌ చేశారు. కాగా ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు మోదీ తెలంగాణకు వస్తున్నారు. దీంతో పాటు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేసే అవకాశముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img