: పీయూష్ గోయల్
దేశమంతా ధాన్యం సేకరిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎందుకు చేయమని కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ప్రశ్నించారు. ఇవాళ దిల్లీలో కేంద్రమంత్రి గోయల్ను తెలంగాణ బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బాపూరావు, బండి సంజయ్ కలిశారు. కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఎంపీలు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లగా కేంద్రం యాసంగి ధాన్యం కొనట్లేదని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై గోయల్ స్పందిస్తూ పార్లమెంటు సాక్షిగా గతంలోనే ఈ విషయంపై సమాధానమిచ్చినట్లు చెప్పారు. యాసంగి సీజన్లోనూ తెలంగాణ నుంచి రారైస్ను కొంటామని స్ఫష్టంచేశారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదని చెప్పారు. గతంలో సేకరించి ఇస్తానన్న బియ్యాన్ని ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పారు. ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసిందన్నారు.