Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ నిర్వహించింది. వారాంతపు సంతల్లో కొవిడ్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారని రాష్ట్రప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. మేడారం జాతర, వారాంతవు సంతల్లో కొవిడ్‌ జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. స్కూళ్ల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది తెలపగా.. వెంటనే ప్రారంభంపై వివరాలు తెలపాలని ఆదేశించింది. ఆన్‌లైన్‌ విచారణకు డీహెచ్‌ శ్రీనివాసరావు హాజరయ్యారు. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉంది. 77 లక్షల ఇళ్లల్లో ఫీవర్‌ సర్వే చేసి 3.45 లక్షల కిట్లు అందజేసినట్టు డీహెచ్‌ తెలిపారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్‌ పేర్కొన్నారు. 3 రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img