తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసులు 6,51,288కి పెరిగాయి.మహమ్మారి బారినపడిన వారిలో గడి,ఇప 24 గంటల్లో 591 మంది బాధితులు కోలుకున్నారు. మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు 3,836కు చేరాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,39,456 మంది బాధితులు కోలుకున్నారు.