తెలంగాణలో గడియిన 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 623 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,43,716కు చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 746 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 9,188 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైంది.