Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రంలో ఘనంగా రంజాన్‌ వేడుకలు.. ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రులు రాష్ట్రంలో రంజాన్‌

రాష్ట్రంలో రంజాన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చార్మినార్‌, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతోపాటు రాష్ట్రంలోని మసీదులు, దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో అధ్యాత్మిక వాతావరణం వెల్లవిరిసింది. ముస్లిం సోదరులు ఒకరికొకరు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న ఈద్గాలో మంత్రి మహమూద్‌ అలీ, సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌‌, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ రావు, సూర్యాపేట మంత్రి జగదీశ్‌ రెడ్డి, బండ ప్రకాశ్‌, నిర్మల్‌లోని చించోలి-బి సమీపంలోని ఈద్గాలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img