: వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల
ఇసుక గుంతల్లో పడి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు.జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో మంజీరా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, ఒకే కుటుంబంలో నలుగురు చనిపోతే సీఎం కేసీఆర్ కనీసం పరామర్శించలేదని దుయ్యబట్టారు. చిన్నారుల మృతికి కారణమైనవారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు.