Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాష్ట్రపతి హైదరాబాద్‌ శీతాకాల విడిది రద్దు..

షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 29 నుంచి జనవరి 3 వరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రావల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల రాష్ట్రపతి శీతాకాల విడిది రద్దు అయ్యింది. ఈ మేరకు ఢల్లీి రాష్ట్రపతి భవన్‌ వర్గాలు వెల్లడిరచాయి. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఆయన డిసెంబర్‌ చివరి వారంలో రానున్నారని రాష్ట్రపతి భవన్‌ ఇటీవల తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడంతో తెలంగాణ అధికారులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై కంటోన్మెంట్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో మేడ్చల్‌ కలెక్టర్‌ హరీష్‌ సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.ఆక్టోపస్‌ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్‌ డ్రిల్‌ కూడా చేపట్టారు. ఇపుడు అకస్మాత్తుగా పర్యటన రద్దు అయింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసు పెరుగుతుండటం, కొత్తగా ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img