Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రాల హక్కులపై కేంద్రంతో పోరాడుతాం : సీఎం కేసీఆర్‌

కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని..రాష్ట్రాల హక్కులపై కేంద్రంతో పోరాడుతామని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.మన దగ్గర నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ. అక్కడ్నుంచి చాలా తక్కువ నిధులు వస్తాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రావాల్సిందే అని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చేది కేవలం సీఎస్‌ఎస్‌ మాత్రమే అని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో మంచి వికాసం జరుగుతుంది. ప్రగతి కనబడుతోంది. ఇప్పుడిప్పుడే మంచి అభివృద్ధిలో పయనిస్తున్నామని అన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి అక్టోబర్‌ వరకు ప్రతి నెల రూ. 227 కోట్లు విడుదల చేశాం. గ్రామపంచాయతీలకే కాకుండా అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ కు రూ. 112 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img