రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)గా వికాస్ రాజ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో బుద్ధ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరై.. వికాస్ రాజ్కు శుభాకాంక్షలు తెలిపారు. వికాస్ రాజ్ 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వికాస్రాజ్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి ప్రమోద్కుమార్ శర్మ గత బుధవారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సీఈవోగా ఉన్న శశాంక్గోయల్ కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్పై వెళ్లడంతో ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉన్నది. ఇంచార్జి సీఈవోగా అడిషనల్ సీఈవో బుద్ధప్రకాశ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వికాస్రాజ్ను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి సీఈవోగా నియమించింది. ప్రస్తుతం వికాస్రాజ్ జీఏడీ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.